మొరాయించిన ఈవీఎం

పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.  ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాలేదు. బుత్ నంబర్ 203కు కేటాయించిన ఈవీఎం పనిచేయలేదు. దాన్ని మరమ్మతు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.