రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

గతంలో మంత్రిగా సునీతా రెడ్డి చేసిందేవిూ లేదు : మదన్‌ రెడ్డి

మెదక్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని నర్సాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సునీతా రెడ్డి ఇక్కడ చేసింది శూన్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. గొల్ల కుర్మల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ గొర్రె లు పంపిణీ చేశారన్నారు. అన్ని వర్గల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్‌ సిద్దంగా ఉన్నారని వివరించారు. నియోజకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాంగ్రెస్‌ నేతలు

ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ప్రజల సమస్యలు పట్టించుకోలేదన్నారు. తాను కష్టపడి గత నాలుగేళ్లలో అనేక కార్యక్రమాలు చేశానని అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష ¬ద దక్కడం కోసం తెలంగాణ ద్రోహులతో పొత్తు పెట్టుకుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని అడుకుంటున్న టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకోని ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో తండాలను గ్రామ

పంచాయతీలుగా చేస్తామని ప్రకటించి ఎందుకు చేయలేదన్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ హావిూ ఇవ్వకుండే గిరిజన తండాలను గ్రామా పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేసి బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేశారన్నారు. శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు రావడం ఖాయమన్నారు. గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్‌ లో నింపి అక్కడి నుంచి సింగూర్‌ ప్రాజెక్టులో తరలించి జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌ రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.