విద్యుద్ఘాతంతో రైతు మృతి

వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): విద్యుదాఘాతానికి గురై పిన్నింటి సురేందర్‌ రావు అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో శనివారం ఉదయం జరిగింది. పంట పొలానికి వెళ్లిన ఆయనకు విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌ కు గురై మృతి చెందాడు. సురేందర్‌ రావు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి వచ్చి సురేందర్‌ రావు శవానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.