సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతాం…

మాజీ డిసిసిబి చైర్మన్‌ పి. లక్ష్మారెడ్డి

తాండూరు 23 మే(జనంసాక్షి) రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతామని మాజీ డిసిసిబి చైర్మన్‌ లక్ష్మారెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం పెద్దేముల్‌ మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్‌ఎస్‌ నామరూపాలు లేకుండా చేయడమే ముఖ్యలక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా ప్రతి ఓక్కరు పనిచేయాలని తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికల్లో నాలుగు మండలాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని దీమావ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జితెందర్‌రెడ్డి, అమరయ్య, ఎన్‌ఎస్‌యుఐ వెంకటేష్‌చారి, మైనార్టీ నాయకుడు ఎండి రియాజ్‌, పెద్దేముల్‌ సర్పంచ్‌తోపాటు పార్టీ సినియర్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.