సెర్ఫ్‌ ఉద్యోగుల మహాధర్నా

ఖమ్మం,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి):తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నగరంలోని సంక్షేమ భవన ఆవరణలో జిల్లాలోని సెర్ఫ్‌ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఎంతో కాలంగా డ్వాక్రాలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనంఇవ్వాలన్నారు. ధర్నా కార్యక్రమానికి న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. స్వర్ణ కుమారి, టీవీవీ జిల్లా బాధ్యులు కె.వి. కృష్ణారావు, తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ సంఘీభావం తెలిపారు.