నోముల నర్సింహయ్య సేవలు చిరస్మరణీయం: పిడిగం నాగయ్య ముదిరాజ్

నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య సేవలు చిరస్మరణీయం అని తిరుమలగిరి సాగర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య ముదిరాజ్ అన్నారు. గురువారం నోముల నరసింహయ్య ద్వితీయ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన  బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు .నోముల నరసింహయ్య అడుగుజాడల్లో కార్యకర్తలు, నాయకులు నడవాలని అన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శాగం అంజిరెడ్డి ,దేవస్థానం చైర్మన్ నాగేండ్ల వెంకటరెడ్డి, చవ్వ నాసర్ రెడ్డి, సీనియర్ నాయకులు శాగం రామాంజిరెడ్డి ,నాగెండ్ల కృష్ణారెడ్డి, శాగం కోటిరెడ్డి, ఇరిగి గోపి, చింతకాయల సీతారాములు, నాగేండ్ల శివారెడ్డి ,వల్లపు ఎల్లయ్య, దండెంశీను, కటికర్ల ఎల్లయ్య ,షేక్ ఖాసిం , కొండలు సేవ నాయక్, మహేశ్వరం రవి, సైదులు తదితరులు పాల్గొన్నారు.