బాధిత కుటుంబానికీ జడ్పీటీసీ చేయూత

శివ్వంపేట జూన్ 22 జనం సాక్షి : బాధిత కుటుంబాన్ని అన్ని ఆదుకోవాడానికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా అన్నారు. మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త బొల్ల  యాదగిరి కరెంట్ షాక్ తో మరణించిన విషయం తెలుసుకున్న జడ్పీటీసి మహేశ్ గుప్తా ఆ కుటుంబాన్ని పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు గొర్రె వెంకట్ రెడ్డి తో కలిసి బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి తనవంతు ఆర్ధిక సహాయంగా సొంత డబ్బులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జడ్పీటీసి అందజేశారు. అలాగే ఎమ్మెల్యే మదన్ రెడ్డితో మాట్లాడి  ఆ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని అన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా అన్నారు.ఈ సమయం లో జడ్పిటిసి  వెంట గుండ్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ తాటి  కిష్టయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఆకుల శ్రీనివాస్, నాగేశ్వరరావు, గోమారం ప్రణీత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.