భారతదేశం పెట్టుబడుల నిధి : మోడీ

ఢిల్లీకి  వచ్చిన సైప్రస్ అధ్యక్షుడితో మీటింగ్ లో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రెండు దేశాలకు సంబంధించిన మంత్రులు, ఆఫీసర్లు కూడా ఈ మీటింగ్ కి హాజరయ్యారు. శాంతి, సెక్యూరిటీ, అభివృద్ధే లక్ష్యంగా దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్నామన్నారు. మొత్తం నాలుగు ఒప్పందాలను ఈ మీటింగ్ లో రెండు దేశాల మంత్రులు సంతకాలు చేశారు. భారతదేశం ఎప్పటికీ పెట్టుబడుల నిధిగా ఉంటుందని పేర్కొన్నారు మోడీ.