రాష్ట్రంలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు

` రూ.80 వేల కోట్లతో ముందుకొచ్చిన సంస్థ
` సీఎం రేవంత్‌ రెడ్డితో సీఎండీ గురుదీప్‌ సింగ్‌ బృందం భేటీ
` సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సంసిద్ధత
` రాష్ట్రంలో 6700 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎంకు వివరణ
` ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో రూ.80వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌ బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది. సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖత తెలిపింది. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎంకు ఎన్టీపీసీ బృందం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.