ఎయిర్‌ ఇండియా వివాదాస్పద నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ  ఎయిర్‌ ఇండియా  ప్రతిష్ట అంతకంతకూ మసకబారుతోంది.  న‌ష్టాల్లో కూరుకుపోయిన  ‘మహారాజా’ ఎయిర్‌ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.   ఇక నుంచి దేశీయ విమానాల్లోని ఎకాన‌మీ క్లాస్ ప్ర‌యాణికులకు మాంసాహారాన్ని రద్దు చేసింది. కేవ‌లం శాకాహారమే ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. కాస్ట్‌ కట్‌ లో భాగంగా   ఈ నిర్ణయం తీసుకున‍్నట్టు తెలుస్తోంది.