కరోనా వేళ.. మేడారం జాతరపై ఏంచేద్దాం.. ` సీఎం కేసీఆర్‌ సమీక్ష


హైదరాబాద్‌,జనవరి 21(జనంసాక్షి): మేడారం సమ్మక్కసారలమ్మ జాతరపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో సవిూక్ష నిర్వహించనున్నారు. జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు, కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ఆయన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అక్కడి పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై వైద్యఆరోగ్యశాఖను ప్రభుత్వం నివేదిక కోరింది. కరోనా నిబంధనల అమలుపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి గురువారం విలేకరులతో మాట్లాడుతూ, మేడారానికి ఇప్పటికే భక్తజన ప్రవాహం మొదలైందని, రోజుకు నాలుగు లక్షల మంది వస్తున్నారని తెలిపారు. కరోనాపై భక్తులను అప్రమత్తం చేస్తున్నామన్నారు.