జపాన్ ఓపెన్లో ముగిసిన భారత్ పోరు
– లీడాంగ్ చేతిలో ఓటమిపాలైన శ్రీకాంత్
టోక్యో, సెప్టెంబర్14(జనంసాక్షి) : జపాన్ ఓపెన్ సిరీస్లో భారత్ పోరు ముగిసింది. తాజాగా తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-19, 16,-21, 18-21 తేడాతో దక్షిణ కొరియా ఆటగాడు లీ డాంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో జపాన్ ఓపెన్లో భారత్ కథ ముగిసినట్లైంది. తొలి గేమ్ను 21-19తో సొంతం చేసుకున్న శ్రీకాంత్కు రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మొదటి నుంచి లీడాంగ్దే ఆధిపత్యం. మధ్యలో శ్రీకాంత్ పాయింట్లు సాధించినప్పటికీ గేమ్ను గెలవలేకపోయాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ ¬రా ¬రీగా సాగింది. మధ్యలో ప్రత్యర్థిని అధిగమించి పాయింట్లు సాధించినా శ్రీకాంత్ చివరి వరకు ఆ లీడ్ను కాపాడుకోలేకపోయాడు. దీంతో 18-21తో మూడో సెట్ను కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకున్నాడు. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో లీడాంగ్ది 33వ ర్యాంకు. ప్రస్తుతం శ్రీకాంత్ 7వ ర్యాంకులో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో అగశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్లోనూ భారత క్రీడాకారులు ముందడుగు వేయలేకపోయారు.