పత్రిక విలేకరి పై అధికార పార్టీ నాయకుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ 

 

 

 

 

పత్రిక విలేకరి పై అధికార పార్టీ నాయకుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ
మోత్కూరు ఫిబ్రవరి 1 జనంసాక్షి : మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఓ పత్రిక విలేకరి చైర్మన్ భర్త వర్సెస్ కౌన్సిలర్లు అనే శీర్షిక తో వార్తా కథనం ప్రచురించారని అధికార పార్టీ నాయకులు అతనిపై దాడి చేయించడం హేయమైన చర్యని ప్రశ్నిస్తే దాడి చేసి బెదిరించే విష సంస్కృతిని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రోత్సహించడం మంచి పరిణామం కాదని ఇటువంటి చర్యలను ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని మండల కాంగ్రెస్ పార్టీ తరపున ఇట్టి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని దాడికి పాల్పడిన వారిపై, ప్రోత్సహించిన వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖ వారిని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని మండల అధ్యక్షులు వంగాల సత్యనారాయణ అన్నారు. అనంతరం కాంగ్రేస్ నాయకులంతా కలిసి విలేఖరి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యంగా ఉండండి మేమంతా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు డా. గుర్రం లక్ష్మి నర్సింహ రెడ్డి, అవిశెట్టి అవిలమల్లు, పట్టణ  అధ్యక్షులు గుండగొని రామచంద్రు గౌడ్,ఓబీసీ మండల  అధ్యక్షులు కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి యాదయ్య, మండల  ఉపాధ్యక్షులు పురుగుల నర్సింహా,మండల  ప్రధాన  కార్యదర్శి రాచకొండ  బాలరాజు గౌడ్,యూత్  కాంగ్రేస్ అధ్యక్షులు కారుపోతుల  వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్  రెడ్డి,పాలడుగు, పనకబండ, పాటిమట్ల గ్రామశాఖ  అధ్యక్షులు అంతటి  వెంకటయ్య, బత్తిని ధర్మయ్య, చిరుమర్తి యాదయ్య,పట్టణ ఉపాధ్యక్షులు అన్నెపు నర్సింహా ఉయ్యాల అంజయ్య,డెంకాల  నరేష్,గుండా రాములు,నల్ల  రాంనర్సయ్య, గుండు యాదగిరి,మర్రి పరిమేష్  తదితరులు  పాల్గొన్నారు.