పాక్ కోడలు అవసరమా?
– తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఆమెను తొలగించాలి
– బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి18(జనంసాక్షి) : తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా భారత టెన్నిస్ స్టార్ సానియా విూర్జాను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సోషల్ విూడియాలో ఈ మేరకు సోమవారం ఆయన పోస్టు చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలను భారత ప్రజలు కోరుకోవడం లేదని, ఈ తరుణంలో పాకిస్తాన్ కోడలైన సానియా విూర్జాను తెలంగాణ ప్రచారకర్తగా తీసేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా మన ముఖ్యమంత్రి.. సానియా విూర్జాను నియమించారని, ఆమె ఎవరు అని ప్రశ్నించారు. పాకిస్తాన్ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుందన్నారు. అలాంటి పాకిస్తాన్ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా చేశారని విమర్శించారు. కేసీఆర్ను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, నేడు మన సైన్యంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారని, ఈ ఘటనలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. ప్రతీ దేశం పాక్ను వ్యతిరేకిస్తుందని, భారత్ కూడా అన్నిరకాల మద్దతును ఉపసంహరించుకుందని, విూరూ కూడా పుట్టిన రోజు జరుపుకోలేదని, ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డానన్నారు. సానియావిూర్జాను ప్రచారకర్తగా తొలగించి పీవీ సింధూ, సైనా నెహ్వాల్లో ఒకరిని నియమించండని కేసీఆర్ రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఒక సారి ఆలోచించాలనిని రాజాసింగ్ సూచించారు. భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగిన సానియా విూర్జాకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిఒక్కరు ఆమె దేశభక్తిని ప్రశ్నిస్తూ.. ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కూడా సానియా తీవ్ర ట్రోలింగ్కు గురయ్యారు. ఈ విషయంపై ఆమె ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ తన దేశభక్తిపై వివరణ కూడా ఇచ్చుకున్నారు. గొంతు చించుకుంటేనే దేశభక్తా అంటూ ప్రశ్నించారు.