పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

– 22మందికి గాయాలు
నల్గొండ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) ఆర్టీసీ బస్సు బొల్తా పడి 22మంది ప్రయాణీకులకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. శక్రవారం తెల్లవారు జామున నల్గొండ జిల్లాలో వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సవిూపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్‌ బయల్దేరింది. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో బుగ్గబావిగూడెం సవిూపంలోకి రాగానే వేగంతో వెళ్తున్న కంటైనర్‌ను తప్పించే క్రమంలో బోల్తాపడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అంతా బురదమయంగా ఉండటంతో పలువురు ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ శ్రీనివాస్‌  ఆధ్వర్యంలో క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.