బైకును ఢీకొన్న కారు

తండ్రీ, ముగ్గురు కొడుకుల మృతి
వరంగల్‌ రూరల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  గీసుగొండ మండలం కొమ్మాల సవిూపంలో విషాదం చోటుచేసుకుంది. కారు-బైక్‌ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ముగ్గురు చిన్నారులు  మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కారు – ద్విచక్రవాహనం ఢీకొడనంతో జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.