రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జిల్లాలోని కోల్చారం మండలం హనుమల బండ గ్రామ సవిూపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.