వైద్య సిబ్బందికి చప్పట్లు కొట్టి  సంఘీభావం తెలుపుతూన్న సీఎం కేసీఆర్ 

 హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా..కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంభసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు,  ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టి…వారందరికి సంఘీభావం ప్రకటించారు.