సిద్ధిపేటకు గోదావరి నీళ్లు తీసుకొస్తా – సీఎం కేసీఆర్..

kgf27uuz

మెదక్ : సిద్దిపేటకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తాను ఇక్కడి వాడినని, ప్రజల దీవెనలతో ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. పంటలు పండించుకోవడానికి గోదావరి నీళ్లు తీసుకొస్తామని, అలాగే హైదరాబాద్ కు నార్త్ లో విమానాశ్రయం త్వరలోనే వస్తుందన్నారు. సిద్ధిపేటకు రైలు మంజూరైందని, ఈ పనులు జరుగుతున్నాయన్నారు. సిద్ధిపేటను జిల్లా చేయడం..సాగు నీరందించడం..రైలు తేవడం.. ఈ మూడు కల్పిస్తే సిద్ధిపేట అద్భుతంగా ముందుకు పోతుందున్నారు. సిద్ధిపేటలో ప్రతీ గ్రామానికి సాగునీరు అందిస్తామని, కాళేశ్వరం నుంచి సిద్ధిపేటకు గోదావరి నీళ్లు తరలిస్తామన్నారు. కాళేశ్వరం దగ్గర జరిగే శంకుస్థాపనకు సిద్ధిపేట నుండి ప్రజలు భారీ ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరంలో విగ్రహానికి తన సొంత ఖర్చులతో బంగారు కిరీటం చేయిస్తానని తెలిపారు. జిల్లా కేంద్రం ఎక్కడ పెట్టాలో మీరే నిర్ణయించుకోవాలిని, సిద్ధిపేట జిల్లా కేంద్రం, మెదక్ జిల్లా కేంద్రం అవుతుందన్నారు.
చెట్లు నాటాలని సీఎం చెప్పాలా?
చెట్లు నాటాలని సీఎం చెప్పాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్ర వారి పాలనలో ఆగమై పోయినామని, ఈ కాలంలో ఎండలు ఉంటాయా అని తెలిపారు. ఈ కాలంలో వానలు రావలంటే మొక్కలు నాటాలని, అడవుల విస్తీర్ణం పెంచాలని సూచించారు. వానలు రమ్మంటే రావాలి..పొమ్మనప్పుడు పోవాలే అని తెలిపారు. హరితహారం ఒక్కరితో విజయవంతం కాదని, ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి హరితహారంలో పాల్గొంటేనే తెలంగాణ పచ్చగా తయారవుతుందని తెలిపారు. ఈ హరితహారం కార్యక్రమంలో ఐదు కోట్ల గ్రాంట్ ప్రకటించడం జరిగిందని, ఇది సిద్ధిపేట వాసులు కొట్టేయాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.