సోషల్‌ విూడియాలో..  తనపై అసత్యప్రచారం చేస్తున్నారు

– ప్రభాస్‌ అనే వ్యక్తిని తానెప్పుడూ కలవలేదు
– జనసేన కార్యకర్తలు, పవన్‌ ఫ్యాన్స్‌ పేరుతో అసభ్య పోస్టులు చేస్తున్నారు
– నేను దోషిగా నిలబడి నావాదన వినిపించాల్సి రావడం దురదుష్టకరం
– ఈ కుట్రల వెనుక తెదేపా హస్తం ఉంది
– చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా..? మేం ఇలాంటి ప్రచారాలు చేయలేమా?
– విలువలకు కట్టుబడి మేం ముందుకెళ్తాం
– టీడీపీ హస్తం లేకపోతే వీటిని ఎందుకు ఖండించడం లేదు
– ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఇలాంటి వాటిని వాడుకుంటున్నారు
– ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే తెలంగాణలో ఫిర్యాదు చేశా
– నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హావిూ ఇచ్చారు
– వైసీపీ నేత, జగన్‌ సోదరి షర్మిల
హైదరాబాద్‌, జనవరి14(జ‌నంసాక్షి) : సోషల్‌విూడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల శనివారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఫిర్యాదు చేశారు. సినీ హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ పేరుతో సోషల్‌ విూడియాలో తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారన్నారని వారిపైనా, అదేవిధంగా తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలపైనా చట్టపరమైన
చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిళ వెంట ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు. అనంతరం షర్మిళ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభాస్‌ అనే వ్యక్తిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని, కలవలేదని తెలిపారు. ఈ ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిళ తెలిపారు. ‘2014 ఎన్నికలకు ముందుకు తనకు సినీ హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందని ఓ వర్గం ప్రచారం చేసిందని, దీనిపై అప్పట్లో నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కొందరిపై చర్యలు తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఆ ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించారని షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాతలు ఇంకెంతో మంది మహిళలపైనా రాస్తున్నారని, అందుకే వెబ్‌సైట్లు, సోషల్‌ విూడియాలో ఇలాంటి రాతలకు చరమగీతం పాడేలా ఏకం కావాలని ప్రజా స్వామ్యవాదులు, రాజకీయ నేతలు, విలేకరులు, మహిళా సంఘాలను కోరుతున్నానన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారు, చేయించేవారు కాకుండా నేను దోషిలా నిలబడి నా వాదన వినిపించుకోవాల్సి రావడం మహిళలకే అవమానకరమన్నారు. అసత్య ప్రచారాలపై నేను స్పందించకపోతే.. అదే నిజమని చాలామంది అనుకునే ఛాన్స్‌ ఉందని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. విూడియా ముందుకు వచ్చాననని తెలిపారు. భార్యగా, తల్లిగా, చెల్లిగా నా నైతికతను, నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంది కావునే ఇలా బయటకు వచ్చానని షర్మిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్‌ను నా జీవితంలో ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని, మా మధ్య ఎలాంటి సంబంధం లేదని నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఈ ప్రచారం నా కుటుంబంతో పాటు స్నేహితులు, సన్నిహితులను ఎంతగానో బాధిస్తోందన్నారు. ఇలాంటి పుకార్లను పుట్టించేవారికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నా అనుమానం ఉందని, టీడీపీకి పుకార్లు కొత్తేవిూ కాదన్నారు. వైఎస్‌ సీఎం కాకముందు ఫ్యాక్షనిస్టు అంటూ ప్రచారం చేశారని, కానీ ఆయన సీఎం అయ్యాక ఎంత మంచి మనిషో ప్రజలకు తెలిసిందే అన్నారు. నా అన్న జగన్‌ విూద కూడా కోపిస్టి అని, ఎవరికి మర్యాద ఇవ్వరని  ప్రచారం చేశారని, ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలే ఈ విషయం అబద్దమని గుర్తించారని అన్నారు. నాపై జరుగుతున్న ప్రచారం కూడా టీడీపీ నేతలు చేస్తున్నదేనని, ఓ అబద్ధాన్ని వందసార్లు చెప్పి దాన్ని నిజం చేయాలన్నదే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాలసీఅని మండిపడ్డారు. చంద్రబాబు ఇంట్లో ఆడోళ్లు లేరా.. మేము అనుకుంటే వారిపై తప్పుడు ప్రచారాలు చేయలేమా అని షర్మిల నిలదీశారు. మాకు విలువలు ఉన్నాయి కాబట్టే మేం అలాంటి ప్రచారాలు చేయడం లేదని అన్నారు. చంద్రబాబు డిక్షనరీలో విలువలు అన్న పదమే లేదని, ఆయన రాజకీయాల్లో దిగజారుడుతనాన్ని ఇప్పటికైనా మానుకోవాలని కోరుతున్నానని షర్మిలా పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని సీపీ హావిూ ఇచ్చారని అన్నారు.