హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణహత్య

హైదరాబాద్: నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర ఓ యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. యువకుడిని దుండుగులు దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశారు. దుండగుల దాడి సమయంలో ఆ యువకుడు రక్షించాలంటూ ఆర్తనాదాలు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. దాడి చేసినవారిలో ఇద్దరిని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.