1లోగా పెసా గ్రామసభలు

ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):  ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో పెసా గ్రామ సభలను ఏప్రిల్‌ 1వ తేదీలోగా
నిర్వహించాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు.  230 షెడ్యూల్డ్‌ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఉపాధ్యక్షుడు, కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంటుందని, ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా అధికారులు తోడ్పడాలని సూచించారు. ప్రతీ 2 నెలలకు ఒకసారి గ్రామ సభ తప్పకుండా నిర్వర్తించే విధంగా చూడాలని కోరారు. 2011లో రూ పొందించిన పెసా రూల్స్‌ ప్రకారం.. ఎన్నికైన వారి పదవీ కాలం ఐదేళ్లపాటు ఉంటుందన్నారు.ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితాను కూడా గ్రామసభలో తయారు చేయాలని అన్నా రు. చట్టాలు, హక్కులు తదితర అంశాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.