ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలి

సంగారెడ్డి,జనవరి16: ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటు చేసేముందు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని రావాలన్నారు. తెలంగాణలో వెనకబడిని మెదక్‌ జిల్లాకు నీటి సదుపాయాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు టిడిపి, వైకాపా అధినేతలు చంద్రబాబు, జగన్‌లుకుట్ర పన్నారని ఆరోపించారు. వీరిద్దరూ తెలంగాణకు అనుకూలమని చెప్పి ఇప్పుడు మాటమార్చడం రాజకీయ ద్రోహం అన్నారు. రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించకుండా సీమాంధ్ర నాయకులు కావాలనే కాలయాపన చేశారని ఆరోపించారు. బిల్లుపై కాలయాపన చేసి తిరిగి రాష్ట్రపతిని సమయం కోరేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు బిజెపితో పొత్తుపెట్టుకుని తెలంగాణ ఏర్పడకుండా చూస్తానని చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను పార్టీ నేతలు గమనించాలన్నారు. చంద్రబాబు కుట్రలను తెలంగాణ టిడిపి నేతలు ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. జగన్‌ తో పాటు సీమాంధ్ర నాయకులు కూడా ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.