బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
నాందేడ్ ప్యాసింజర్ డ్రైవర్
హైదరాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని ప్రమాదానికి కారణమైన నాందేండ్ ప్యాసింజర్ రైలు డ్రైవర్ సత్యనారాయణ తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పారు. ఆ సమయంలో రైలు 90కి.మీల వేగంతో ఉందని … క్రాసింగ్ వద్ద నిరంతరాయంగా సైరన్ మోగించామని చెప్పారు. రైలు వంద మీటర్లు దూరంలో ఉండగా బస్సు పట్టాలపైకి వచ్చిందని… బస్సును చూసిన వెంటనే అత్యవసర బ్రేకులు వేశామని వివరించారు. లాలాగూడాలోని రైల్వే ఆసుపత్రిలో నాందేండ్ ప్యాసింజర్ రైలు డ్రైవర్లు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.