విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ

రఘునాధపాలెం మార్చి 21(జనం సాక్షి) మండలం పాపటపల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థులకు మరియు విద్యార్థినిలకు మంగళవారం బోడేపూడి రాజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులని ఉద్దేశించి బి రాజా, మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థినీ విద్యార్థులు చాలా కష్టపడి చదివి తల్లిదండ్రులకు టీచర్లకు స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు, బంగారు భవితకు పునాది అయినటువంటి పదవ తరగతి పరీక్షలు బాగా రాయాలని
రాబోయే రోజుల్లో మీరు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు