విద్యావంతులను స్ట్రీట్‌ వెండర్లుగా మార్చిన కెసిఆర్‌

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం
సోషల్‌ విూడియా వేదికగా మండిపడ్డ రాములమ్మ
హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఆ బంధు.. ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు హడావుడి చేసే సీఎం కేసీఆర్‌ విద్యావంతుల పాలిట రాబందు అని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. దాదాపు 60 వేలకు పైగా విద్యావంతులైన యువతరం ఉద్యోగాల్లేక స్ట్రీట్‌ వెండర్లుగా మారారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ’పట్టణ ప్రగతి ` సర్వే ఆఫ్‌ స్టీట్ర్‌ వెండార్స్‌’ యాప్‌లో వీధి వ్యాపారుల కేటగిరీలో నమోదైన వివరాలు గమనిస్తే గుండె చెరువయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇటీవల విూడియాలో గణాంకాలతో సహా బయటికొచ్చిన తెలంగాణలోని విద్యావంతుల పరిస్థితి. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ లో దాదాపు 60 వేల మందికి పైగా విద్యావంతులైన యువతరం మరో మార్గం లేక స్టీట్ర్‌ వెండార్లుగా మారి తోపుడు బండ్లతో రోడ్ల విూదికి వచ్చారు. నోటిఫికేషన్లు రావు… ఉద్యోగాల్లేవు… నిరుద్యోగభృతి లేదు… ఆశ నిరాశల మధ్య ఆత్మహత్యలు ఆగడం లేదు. ’పట్టణ ప్రగతి ` సర్వే ఆఫ్‌ స్టీట్ర్‌ వెండార్స్‌’ యాప్‌లో వీధి వ్యాపారుల కేటగిరీలో నమోదైన వివరాలు గమనిస్తే గుండె చెరువయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వెండార్స్‌లో పీజీలు చేసినవారు, టెక్నికల్‌ కోర్సులు పూర్తి చేసినవారు, కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్‌ ఉపాధ్యాయులు… ఇలా ఎందరెందరో కన్నీటి ధారలతో కనిపిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగాల మాట కల్ల అని స్పష్టంగా అందరికీ అర్థమ య్యేలా ఈ వార్తా కథనం వాస్తవాల్ని ప్రజల ముందుంచింది. ప్రధానమంత్రి స్వనిధి ద్వారా మోదీగారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.10 వేల రుణమే వీరికి కాస్తో కూస్తో ఊరట కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని వీధిన పడేయటం తప్ప చేసిందేవిూ లేదని బాగా తెలిసొచ్చింది‘ అని రాములమ్మ తెలిపారు.