కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో గణపతి పూజ

కూకట్ పల్లిసెప్టెంబర్ 01(జనంసాక్షి ) :వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, తెరాస నాయకులతో కలిసి కార్పొరేటర్ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలందరికీ గణేష చతుర్థి శుభాకాంక్షలు తెలియచేసారు.గణపతి పూజను ప్రశాంతంగా జరుపుకుని ప్రజలందరూ ఆయురోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, వాసుదేవరావు షౌకత్ అలీ మున్నా, మోజెస్, బాలస్వామి, అగ్రవాసు, భాస్కర్, రాజ్యలక్ష్మి, రవీందర్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.