కుత్బుల్లాపూర్‌లో పగిలిన పైపు..

వృధా అయిన నీరు
హైదరాబాద్‌, జూలై 10 : జీడిమెట్ల సమీపంలోని కుత్బుల్లాపూర్‌లో మంజీరా పైపులైను పగిలింది. పరిసర రోడ్లు జలమయమయ్యాయి. సమీపంలోని అపార్టుమెంటులోని సెల్లార్‌లోకి నీరు చేరింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం కుత్బుల్లాపూర్‌లో 1200 ఎంఎం మందం గల పైపులైను పగిలింది. దాదాపుగా 50వేల లీటర్ల గ్యాలాన్ల నీరు వృదాగా పోయింది. నీరంతా సమీపంలోని అపార్టుమెంటులోకి చేరడంతో అందులో నివసించేవారు అవస్థలు పడ్డారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా పగిలిన పైపు లైనును పునరుద్దరించాలంటే కనీసం మూడు నాలుగు రోజులు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. త్వరితగతిన పూర్తి చేసి మంచినీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను స్థానికులు కోరారు.