శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు

మల్దకల్ సెప్టెంబర్ 27(జనంసాక్షి):దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చాడు. తొమ్మిది రోజుల పాటు జరిగే అలంకరణలలో భక్తులకు శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ భక్తులకు ప్రత్యేక కుంకుమార్చన పూజలు, సామూహిక ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా దాతలుగా నరహరి ప్రవీణ్ కుమార్ ,గణేకల్ సత్యనారాయణ,ఇల్లూరి అశోక్, పల్లా వెంకటేష్ ,పల్లా నరసింహయ్య,గుంజపల్లి శ్రీనివాసులు,వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు బాదం శ్రీనివాసులు,మనసాని నాగరాజు ,ఇల్లూరి నాగరాజు, నరహరి వెంకటేష్ ,నరహరి ప్రవీణ్ ,పద్మనాభం ,సింగరేణి నరసింహయ్య ,నరహరి సూరిబాబు,ఇల్లూరి గంగాధర్, పల్లా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.