ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కాకినాడ,నవంబర్‌8 (జనంసాక్షి) : తూర్పు గోదావరి : ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున అమలాపురం రూరల్‌ మండలంలో చోటు చేసుకుంది. తూర్పు గోదావరి అమలాపురం రూరల్‌ మండలం కామనగరువు కిమ్స్‌ ఆసుపత్రి సవిూపంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పారుపూడి జోసెఫ్‌ (26) మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళకూరు మండలం కాళ్ళకూరు గ్రామానికి చెందిన జోసెఫ్‌ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు