చిరు ‘స్టాలిన్’ బాటలో మోడీ

మీరు ముగ్గురికి సాయం చేయండి… ఆ ముగ్గరిని చెరో ముగ్గురికి సాయం చెయ్యమని చెప్పండి.. అంటూ స్టాలిన్ సినిమాలో సందేశమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతున్నారు పీఎం మోడీ. భీమ్ యాప్ ను ప్రమోట్ చేసే పనిలో ఉన్న మోడీ… ఆ యాప్ యూజర్లకు భారీ నజరానాలు ప్రకటించారు. ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వాళ్లు మరికొంతమందితో  ఇన్ స్టాల్ చేయించండని చెబుతున్నారు.

అలా చేసి… మూడు లావాదేవీలు చేయిస్తే.. 10 రూపాయలు  మీ అకౌంట్ లో చేరుతాయి. ఇలా రోజుకు 20 మందితో చేయిస్తే … 200 రూపాయలు అకౌంట్ లో చేరినట్టేనని చెబుతున్నారు పీఎం. దీని ద్వారా సమ్మర్ హాలిడేస్ లో పేద విద్యార్థులకు డబ్బు సంపాదనకు వెసులుబాటు కల్పించినట్టేనని అంటున్నారు మోడీ. అక్టోబర్ 14 వరకు ఈ ఆఫర్ ను ప్రకటించింది కేంద్రం.