జాతరకు ప్రత్యేక అధికారి నియామకం ఎప్పుడో?

ములుగు(మేడారం)ఫిబ్రవరి10(జనం సాక్షి):-
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు ప్రత్యేక అధికారిని నియమించడం ఆనవాయితీ. ఈ సారి మాత్రం నియమించలేదు. ముందస్తుగా నియమిస్తే పనుల పర్యవేక్షించడంతోపాటు జాతర ఏర్పాట్లు, తదితర విషయాలతో అధికారులను అప్రమత్తం చేస్తూ.విజయవంతానికి కృషి చేస్తారు.2020 జాతరలో అప్పటి వరంగల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, 2018జాతరలో సీనియర్ ఐఏఎస్ వాకాటి కరుణను నియమించారు.ప్రస్తుతం కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. ఏటూరునాగారం ఐటిడిఏకు ఆయనే ఇంచార్జి పిఓ, గత జాతరలో పిఓ ఉండటంతో ఐటీడీఏ పరిధిలో జరిగే పనులను ఆయనే చూసుకున్నారు.కానీ,పిఓ బాధ్యతలు కూడా కలెక్టర్ చూస్తుండటంతో అన్నీ తానే చూసుకోవాల్సి వస్తోంది.