టిడిపి సభ్యులకు అడుగడుగునా అవాంతరాలు

అసెంబ్లికి వస్తుండగా పోలీసుల అడ్డంకులు
అమరావతి,మార్చి7(జనం సాక్షి): అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మూమెంట్‌ ఉందంటూ టీడీపీ ప్రజా ప్రతినిధులను పోలీసులు నిలిపివేశారు. మందడం చెక్‌ పోస్ట్‌ దగ్గర టీడీపీ సభ్యుల వాహనాన్ని నిలువరించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. పోలీసులతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చివరకు కార్యకర్తల ఆందోళనతో టీడీపీ నేతలకు పోలీసులు దారి వదిలారు. ఉదయం టీడీపీ ప్రజా ప్రతినిధులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అసెంబ్లీకి బయలుదేరారు. కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం గవర్నర్‌ ప్రసంగిస్తున్నారు.