టి.డి.పి. పార్టీ. బలోపేతానికి. కృషి..


తెలుగు మహిళ అధ్యక్షురాలు. శిరీష….

మాకవరపాలెం. ఫిబ్రవరి.16.( జనంసాక్షి )…మండలంలోతెలుగుదేశం పార్టీని పటిష్టపరిచేందుకు విశేష కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు అల్లంపల్లి శిరీష అన్నారు.మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. నివాసంలో మంగళవారం మండల స్థాయి టి.డి.పి. పార్టీ. విష్కృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కమిటీని ఏకగ్రీవంగా ముఖ్యనాయకులు అందరూ ఎన్నుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.2024.లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మండలంలో పార్టీ విజయం సాధించేందుకు ఇ ప్పటి నుంచే అన్ని గ్రామాల్లో పార్టీ ని. బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే గ్రామాల్లో సమస్యలపై పోరాడుతూ. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ. పదవి ఇచ్చిన మాజీమంత్రి. అయ్యన్నపాత్రుడు కి శిరీష ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు. శేషుకుమార్.అల్లురామునాయుడు. పలు గ్రామాల సర్పంచులు. ఎంపీటీసీ లు. అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.