నేడు శాకంబరి ఉత్సవాలు

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత ఆలయంలో ఈనెల 26వ తేదీన ఉదయం శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పెద్ద ఎత్తున కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించాలని కోరారు. దేవిధంగా 27వతేదీన సంపూర్ణ చందగ్రహణము ఉన్న దృష్ట్యా అదేరోజు సాయంత్రం ఆలయం ముసివేయనున్నట్లు ఆయన తెలిపారు.