మురళీమోహన్ బాటలో నడవాలి: చంద్రబాబు
అమరావతి,డిసెంబర్8(జనంసాక్షి):రాజధానిలోని సీఎం నివాసం వద్ద క్యాన్సర్ అంబులెన్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ మురళీమోహన్ ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.1.75 కోట్లతో దీన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా మురళీమోహన్ను సీఎం అభినందించారు.
మురళీమోహన్ ఓ మంచి ఆలోచన చేశారని, ఆయన బాటలో మిగిలిన ఎంపీలందరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గానికీ ఓ వాహనం అందుబాటులో తెస్తే రాష్ట్రంలో క్యాన్సర్ను పూర్తిగా జయించొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అంబులెన్స్ ద్వారా గ్రావిూణ ప్రజలకు క్యాన్సర్ ముందస్తు పరీక్షలు పూర్తిగా అందిస్తున్నామని ఎంపీ మురళీమోహన్ తెలిపారు. గ్రామాల్లో క్యాన్సర్ చికిత్స లను అందుబాటులో తెచ్చేందుకు ఈ వాహనం రూపొందించామన్నారు. మండల హెడ్ క్వార్టర్స్లో ఈ వాహనాన్ని ఉంచి గ్రామాల్లో ఉన్న ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు.