ఆక్సిజన్‌ నిల్వలు పెంచండి

` కనీసం 48గంటలు ఉండేలా చేయాలి
` అన్ని రాష్టాల్రకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ
న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి):దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. రోజురోజుకీ వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం విూద నమోదైన కరోనా కేసుల సంఖ్య 1.94 లక్షలకు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అలర్ట్‌ అయిన మోడీ సర్కార్‌.. అన్ని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. ఆస్పత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు పెంచుకోవాలని, కనీసం 48 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ బఫర్‌ స్టాక్‌ ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రటరీలకు కేంద్ర హెల్త్‌ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ ఓ లేఖ రాశారు. మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు పెంచు కోవాలని ఆ లెటర్‌ లో ఆయన సూచించారు. దీనికి అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలన్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్ల నిర్వహణ పైనా శ్రద్ధ వహించాలని రాజేశ్‌ భూషణ్‌ కోరారు. ఈ ప్లాంట్ల పనితీరు, తగినంత ఆక్సిజన్‌ గాఢత ఉండేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్న ఆరోగ్య సేవలను విస్తృతపర్చాలని సూచించారు. కాగా, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని సెంట్రల్‌ హెల్త్‌ మినిస్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ కూడా రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆయన మంగళవారం కొన్నిరాష్టాల్రఆరోగ్య మంత్రులతో సవిూక్ష నిర్వహించారు. అన్ని రకాల ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ల్రు పనిచేసేలా రెడీ చేసుకోవాలని చెప్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్నారు. దేశ రాజధాని ఢల్లీిలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 30వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు ఆంక్షలను విధించింది ఢల్లీి ప్రభుత్వం. కరోనా బారిన పడుతున్న వారిలో పోలుసులు ఎక్కువగానే ఉన్నారు. రీసెంట్‌ గా 1700మంది పోలీసులకు కరోనా పాజిటీవ్‌ గా నిర్థారణ అయింది. హోం గార్డుల నుంచి ఉన్నతస్థాయి అధికారులు కరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 12 తేదీల మధ్యలోనే 1700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఢల్లీి పోలీస్‌ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే? 21,259 కరోనా నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 23 మంది కరోనా కారణంగా చనిపోయారు.