కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు రాజకీయాలు:అమిత్‌ షా

అసోం14 మార్చి (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా అన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని విభజించాలనుకునే వారితో కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలిపిందని రాష్ట్రంలో రాజకీయ పార్టీల పొత్తులపై విమర్శించారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండి, ఒక ప్రధాని (మన్మోహసింగ్‌) ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రమైనా కూడా అభివృద్ధికి నోచుకోలేదని, ఇతర దేశాల నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకోలేకపోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంతదూరమైన వెళ్తుందని, ఏఐయూడీఎఫ్‌ నేతృత్వంలోని బద్రుద్దీన్‌ అజ్మల్‌తో చేతులు కలపడం అందుకు నిదర్శనమని షా విమర్శించారు. ప్రముఖ గాయకుడు, సంగీత కళాకారుడు భూపేన్‌ హజారికాకు సముచిత గౌరవం ఇస్తూ భారతరత్న ఇచ్చిన ఘన మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. భాజపా అధికారంలోకి వస్తే అభివృద్ధి రెండింతలు అవ్వడం ఖాయమని చెప్పారు.

అసోం వీరులను గుర్తించిన పార్టీ భాజపానే: రాజ్‌నాథ్‌

అసోం హీరోలను గుర్తించిన పార్టీ భాజపానేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోహ్‌పూర్‌లో ఆయన మాట్లాడారు. గతంలో అసోం మంత్రులు నుంచి ఎవరైనా దిల్లీకి వచ్చి మాట్లాడితే వారిని పట్టించుకునేవారు కాదని, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి నెలా పర్యటించి అక్కడి వారి సమస్యలను పరిష్కరించాలని పార్టీలోని అగ్రనేతలకు మోదీ సూచించారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో నడవాలంటే భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.