తృటిలో తప్పించుకున్న ఇద్దరు జాలర్లు

భోపాల్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): భోపాల్‌లో ఇద్దరు మత్య్సకారులు తృటిలో ప్రాణపాయం నుంచి బయట పడ్డారు. వరదల్లో చిక్కుకున్న ఆ ఇద్దరిని భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కెరవా డ్యామ్‌లో చాపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ..డ్యామ్‌ గేట్లు తెరుచుకోండంతో.. ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగి అందులో చిక్కుకున్నారు. ప్రాణాల విూద ఆశలు పోగొట్టుకున్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది అధికారులు సాహసోపేతంగా వారిద్దరినీ కాపాడారు. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌ లో కుండపోత వర్షాలకు డ్యాముల్లోకి వరద నీరు భారీగా చేరుకుంటోంది. నిల్వ సామర్థ్యానికి ఎక్కువ నీరు చేరడంతో అధికారలులు కార్వా డాం గేట్లు ఎత్తేశారు. దీంతో కింది ప్రాంతాలకు వరద ఉధృతి పెరిగింది.