యాదవ సంఘం భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

యాదవ సంఘం నాయకులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫోన్
చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : ఇటీవల ఆకునూరు గ్రామ యాదవ సంఘం నూతన భవన నిర్మాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డీ.ఎం.ఎఫ్.టీ ఫండ్ ద్వారా 10 లక్షలు మంజూరు చేసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం యాదవ సంఘం నాయకుడు సందబోయిన వెంకటేష్ కు ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ఫోన్ చేసి యాదవ సంఘం భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరినట్లు వారు తెలిపారు.