చండ్రుగొండ జనంసాక్షి (మార్చి 06)స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి కెసిఆర్ అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కటౌట్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అంగన్వాడీ టీచర్లకు పారిశుధ్య కార్మికులకు శాలువాతో సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా ఆదేశాల అనుసారం మండలంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పై మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు (బాబు),జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్,ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు,ఎంపీటీసీలు భూక్యారాంజీ,లంక విజయలక్ష్మి ,ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు,ఉన్న నాగరాజు , నాగేశ్వరరావు,మారుతి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
Other News
- టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
- కాంగ్రెస్ పార్టీకి ఊహించని బిగ్ షాక్
- కొండగట్టులో ఘనంగా హనుమత్ జయంతి
- వానాకాలం పంటల సాగుకు యాక్షన్ప్లాన్
- అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
- కోనసీమలో నిఘా వైఫల్యం
- కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా
- *బీసీ యువతకు నైపుణ్యాభివ్రుద్ది కార్యక్రమాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ*
- *సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
- *రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*