అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి

తూళ్లూరు స్టేషన్‌ ముందు రైతుల ఆందోళన
అమరావతి,అగస్టు12(జనం సాక్షి): రాజధానిలో అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టాలంటూ తుళ్ళూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. ఇప్పటికే అక్రమ తవ్వకందారులపై కేసులు నమోదుచేశామని సీఐ దుర్గా ప్రసాద్‌ తెలిపారు. రాజధాని ఆస్తుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, తనపై వచ్చిన ఆరోపణలపై సీఐ దుర్గాప్రసాద్‌ వివరణ ఇచ్చారు. విూరు చెపుతున్న ఆడియో నాది కాదు. విచారణకు ఆదేశించామని సీఐ తెలిపారు. పోలీసులపై తమకు నమ్మకం లేదని ఇప్పటికైనా రాజధాని ఆస్తులు పరిరక్షణకు కృషిచేయాలని రైతులు నినాదాలు చేశారు.