అఖిల్‌ హీరోగా దిల్‌ రాజు చిత్రం

అక్కినేని అఖిల్‌ హీరోగా అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తాజా సమాచారం. అక్కినేని ’మనం’ సినిమాలో చిన్న రోల్‌ చేసి ఆకట్టుకున్న అఖిల్‌ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు సినిమాల ప్లాప్‌ తర్వాత ఎట్టకేలకు తన నాలుగవ సినిమా ’మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ తో హిట్‌ అందుకున్నాడు అఖిల్‌. ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ’ఏజెంట్‌’ సినిమాను చేస్తున్నాడు. సాక్షి వైద్య ఇందులో అఖిల్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను అనిల్‌ సుంకర, సురేందర్‌ రెడ్డి కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం అఖిల్‌ కంప్లీట్‌గా తన లుక్‌ నే మార్చేసి కొత్తగా మోకోవర్‌ అయ్యాడు. హెయిర్‌ స్టైల్‌, సిక్స్‌ ప్యాక్‌ బాడీ ఇలా మొత్తంగా మారిపోయాడు. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్స్‌ సీన్స్‌ కోసం కూడా అఖిల్‌ చాలా శ్రమిస్తున్నాడట. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత అఖిల్‌ హీరోగా టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌ వినిపిస్తోంది.’రౌడీ బాయ్స్‌’, ’ఎఫ్‌ 3’ చిత్రాలతో వరుస హిట్స్‌ అందుకున్న దిల్‌ రాజు.. నాగ చైతన్య, రాశిఖన్నా జంటగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ’థాంక్యూ’ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే అఖిల్‌తో కూడా ఓ చిత్రాన్ని నిరంచనున్నారట. దీనికి ’ వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌ చేయబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.