అట్టహాసంగా బింబిసార ప్రీ రిలీజ్‌ఈవెంట్‌

వేడుకల్లో ఫిట్స్‌తో అభిమాని మృతి

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ’బింబిసారా’. మల్లిడి వశిష్ఠ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ శుక్రవారం మాదాపూర్‌లోని శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్‌ వేడుకను జరిపారు. ఈ వేడుకకు జూ.ఎన్‌టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దాంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఈవెంట్‌కు వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకలో ఓ అభిమాని మృతి చెందాడు. మృతిడి పేరు పుట్టా సాయిరామ్‌గా తెలిపారు. ఆంధప్రదేశ్‌లోని వెస్ట్‌ గోదావరి జిల్లా పెంటపాడు మండలాని చెందిన పుట్టా సాయిరామ్‌ కూకట్‌పల్లిలో ఓ ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడు. కాగా శుక్రవారం జరిగిన బింబిసారా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అభిమాన హీరోలను చూసేందుకు సాయిరామ్‌ కూడా వెళ్ళాడు. అయితే ఈ ఈవెంట్‌లో సాయ్‌రామ్‌కు ఆకస్మాత్తుగా ఫిట్స్‌ వచ్చింది. దాంతో చికిత్స నిమిత్తం కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే సాయిరామ్‌ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి సాయిరామ్‌ను తరలించారు. ఈ ఘటనపై మాదాపూర్‌ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.