అప్రకటిత కోతలు లేకుండా కరెంటు అందించాలి:రాఘవులు

విజయవాడ:అప్రకటిత కోతలు లేకుండా కరెంటును ప్రజలకు సక్రమంగా అందించాలని విజయవాడలో విద్యుత్‌ శాఖ డీఈకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వినతిపత్రం అందించారు.విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గవర్నరు పేటలో విద్యుత్‌ శాఖ ఎస్‌ ఈ కార్యాలయం ఎదుల ఏర్పాటుచేసిన ధర్నాలో రాఘవులు పాల్గోన్నారు.వేళాపాళా లేని కరెంటు కొతలవల్ల ప్రజలు తీవ్రమైన కష్టాలు పడుతున్నారని రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గత దశాబ్దకాలంలో జెస్‌కోకు పెట్టుబడులు పెట్టక అప్పులు ఇవ్వక,ఉత్పత్తి చేయకుండా పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసింది ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని రాఘవులు అన్నారు.