అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్

ఝరాసంగం సెప్టెంబర్ 1 (జనంసాక్షి ) టీఆర్ ఎస్ ప్రభుత్వం లోనే తెలంగాణ రాష్ట్రం లోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు.గురువారం ఝారాసంగం మండలంలోని కృష్ణాపుర్, బిడేకన్న, చిలేపల్లీ, చిలేపల్లి తండ గ్రామలలో 80 లక్షల రూపాయల ఎస్ డి ఎఫ్ ప్రత్యేక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అర్హులైన 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ధృవపత్రాలన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని 138 గ్రామాలకు 20 లక్షల చొప్పున 27.60 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు.
కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు రాచయ్య స్వామీ, మాజీ మండల అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ పాటిల్, ఎంపీటీసీ చిలపల్లి ఎంపీటీసీ హఫీజ్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జగదీశ్వర్, సర్పంచులు అమర్నాథ్, ఎండీ ఫరూఖ్ పటేల్, నాగమ్మ, విజయ్ కుమార్ రాథోడ్, మాజీ సర్పంచ్ వెంకటేశం, గ్రామ అధ్యక్షులు మూస పటేల్, పిజి మల్లన్న, టిఆర్ఎస్ నాయకులు నర్సన్న పటేల్, ఏజాస్ బాబా, దత్తు, సంజీవ్, మల్లేష్ యాదవ్, చెన్న రెడ్డీ, సుధాకర్, శివాజీ రాథోడ్, విజయ్ రాథోడ్, ఆరిఫ్ ఎంపిడిఓ సుజాత,పంచాయతీ కార్యదర్శిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.