అలీషా కుటుంబానికి టిడిపి నేతల పరామర్శ

గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): దాచేపల్లిలో టీడీపీ నేతల బృందం శనివారం పర్యటించింది. ఎక్సైజ్‌ పోలీసుల దాడిలో మృతి చెందిన అలిషా కుటుంబ సభ్యులను పరామర్శించింది. అలిషా చిత్ర పటానికి టీడీపీ నేతలు నివాళి అర్పించారు. అలిషా ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లింలు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ కొండారెడ్డిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని నినాదాలు చేశారు. దాచేపల్లిలో పర్యటించిన వారిలో టీడీపీ కీలక నేతలు నక్కా ఆనంద బాబు, జీవీ ఆంజనేయులు, యరపతినేని, నాగూల్‌ విూరా, అబ్దుల్‌ అజీజ్‌, నజీర్‌, నసీర్‌ అహ్మద్‌ ఉన్నారు.