ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆటో

మహబూబ్‌నగర్‌: రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి అటో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్వక్తి దుర్మరణం పాలయ్యాడు మహబూబ్‌నగర్‌ మండలం పరిధిలోని కోడూరు గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను మహబూబ్‌నగర్‌ నుంచి మన్నెంకోండ  వైపు వెళ్లే ఆటో ఢీకొట్టింది. ఈఘటనలో వెంకటయ్య 55 అక్కడి కక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా కెంద్ర ఆసుపత్రికి తరలించారు. వెంకటయ్యను కోడూరు పమీపంలోని లంబడి తండాకి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.