ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదు


జగన్‌ పాలనపై బిజెపి నేత కన్నా విసుర్లు
అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో సెంట్రలైజ్డ్‌ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే పోలీస్‌ కేసులు పెట్టేస్తున్నారని మండపడ్డారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉండేదని…ఇప్పుడు సీఐడీ పటిష్టంగా ఉందని అన్నారు. రాష్టాన్రికి క్యాపిటల్‌ ఎక్కడ అని చెప్పుకోలేని స్ధితిలో ప్రభుత్వం ఉందన్నారు. పోలీస్‌ వ్యవస్థ ప్రతిపక్షాలను అణగదొక్కడానికే పని చేస్తోందని విమర్శించారు. 2008 లో వైఎస్సార్‌ తెచ్చిన ఆన్‌లైన్‌ జీవోల విధానాన్ని జగన్‌ నిలిపివేశారన్నారు. రహస్య పాలన నడపాలి అని ప్రభుత్వం భావిస్తుందని మండిపడ్డారు. ప్రజలకు డబ్బులు పంచుతున్నాం అనుకుంటే సరిపోదని…వాళ్ళు అన్ని అనుమనిస్తున్నారని తెలిపారు. నేతల హౌస్‌ అరెస్ట్‌లు పరిపాటిగా మారాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.