ఇరుకుటుంబాల మధ్య భూ తగాదా

ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు
రాజమండ్రి,ఆగస్ట్‌17(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మొగలికుదురు అరుంధతి పేటలో దారుణం జరిగింది. భూమి సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి
చెందిన ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.